airport: ఎయిర్‌పోర్టు ర‌న్‌వేపైకి ప్ర‌వేశించిన వ్య‌క్తి.. విమానం కొన‌డానికి వ‌చ్చాన‌ని స‌మాధానం!

  • చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘ‌ట‌న‌.. హై అల‌ర్ట్‌
  • పోలీసుల‌కు అప్ప‌గించిన విమానాశ్ర‌య సిబ్బంది
  • అత‌డికి మ‌తి స్థిమితం లేద‌ని గుర్తించిన పోలీసులు
  • విమానాశ్ర‌యంలో భ‌ద్ర‌త డొల్ల‌త‌నం రుజువైంద‌ని విమ‌ర్శ‌లు

చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో ర‌న్‌వేపై తిరుగుతోన్న ఓ వ్య‌క్తిని గుర్తించిన సిబ్బంది అత‌డిని అదుపులోకి తీసుకుని పోలీసుల‌కు అప్ప‌గించారు. ఈ ఘ‌ట‌న‌తో విమానాశ్ర‌యంలో హై అల‌ర్ట్ ప్ర‌క‌టించారు. అయితే, విచార‌ణ‌లో అత‌డు విచిత్ర వ్యాఖ్య‌లు చేశాడు. తాను విమానాన్ని కొన‌డానికి ఎయిర్‌పోర్టుకి వ‌చ్చాన‌ని అందుకే అక్క‌డ తిరుగుతున్నాన‌ని అన్నాడు. చివ‌ర‌కు అతని మానసిక స్థితి సరిగా లేదని పోలీసులు గుర్తించారు.

అతడి కుటుంబ స‌భ్యుల‌కు ఈ సమాచారం అందించారు. అయితే, ఓ సాధార‌ణ వ్య‌క్తి సునాయాసంగా విమానాశ్రయంలోకి ప్ర‌వేశించ‌డం ప‌ట్ల ప్ర‌యాణికులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. విమానాశ్ర‌యంలో భ‌ద్ర‌త డొల్ల‌త‌నం మ‌రోసారి రుజువైంద‌ని విమ‌ర్శిస్తున్నారు. ఆ వ్యక్తి వీఐపీలు వెళ్లే గేట్‌ నుంచి రన్‌వేలోకి ప్రవేశించాడని పోలీసులు గుర్తించారు.

More Telugu News