pavan kalyan: వారణాసికి బయల్దేరనున్న 'అజ్ఞాతవాసి'!

  • తదుపరి షెడ్యూల్ వారణాసిలో 
  • ఈ షెడ్యూల్ తో షూటింగ్ పూర్తి 
  • వచ్చేనెల 15న ఆడియో రిలీజ్  

పవన్ కల్యాణ్ .. త్రివిక్రమ్ కాంబినేషన్లో 'అజ్ఞాతవాసి' సినిమా తెరకెక్కుతోంది. కీర్తి సురేశ్ .. అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయికలుగా నటిస్తోన్న ఈ సినిమా, ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణను పూర్తి చేసుకుంది. హైదరాబాద్ .. యూరప్ లలో ఈ సినిమాకి సంబంధించిన ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించారు. తదుపరి షెడ్యూల్ ను వారణాసి .. అలహాబాద్ ప్రాంతాల్లో ప్లాన్ చేశారు. త్వరలోనే ఈ సినిమా టీమ్ అక్కడికి బయల్దేరనుంది.

అక్కడ కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారట. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ షెడ్యూల్ తో ఈ సినిమా షూటింగ్ పూర్తవుతుందని సమాచారం. ఈ సినిమాకి అనిరుధ్ సంగీతాన్ని అందించిన సంగతి తెలిసిందే. వచ్చేనెల 15వ తేదీన ఈ సినిమా ఆడియో వేడుకను నిర్వహించి, సంక్రాంతి కానుకగా జనవరిలో సినిమాను విడుదల చేయనున్నారు. పవన్ 25వ సినిమాగా .. త్రివిక్రమ్ తో చేస్తోన్న మూడవ సినిమాగా ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలు వున్నాయి.     

More Telugu News