rajasekhar: నైజామ్ లో 'గరుడ వేగ' అత్యధిక వసూళ్లు

  • నైజామ్ లో 2 కోట్ల షేర్ రాబట్టిన 'గరుడ వేగ'
  • ఫుల్ రన్ లో 2.5 కోట్ల షేర్ రావచ్చనే అంచనా
  • రాజశేఖర్ కెరియర్లో నైజామ్ లో ఈ స్థాయి వసూళ్లు ఇదే మొదటిసారి    

'గరుడ వేగ' మూవీ ఫలితం ఏ మాత్రం తేడా కొట్టినా, రాజశేఖర్ కెరియర్ ప్రశ్నార్థకంగా మారుతుందనే టాక్ వినిపించింది. ఈ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా .. విడుదలైన ప్రతి ప్రాంతంలో భారీ వసూళ్లను రాబడుతూ దూసుకుపోతోంది. ఈ నెల 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా, అన్నివర్గాల ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ రాబడుతూ వెళుతోంది.

 ముందుగా వచ్చిన సినిమాలకు .. తరువాత వచ్చిన సినిమాలకు గట్టిపోటీ ఇస్తూ ఈ సినిమా నిలబడింది. ఒక్క నైజామ్ లోనే ఈ సినిమా ఇంతవరకూ 2 కోట్ల షేర్ ను రాబట్టింది. ఫుల్ రన్ లో 2.5 కోట్ల షేర్ ను వసూలు చేయవచ్చని చెబుతున్నారు. నైజామ్ లో అత్యధిక వసూళ్లను రాబట్టిన రాజశేఖర్ సినిమా ఇదేనని అంటున్నారు. ఈ సినిమా తరువాత దర్శకుడు ప్రవీణ్ సత్తారు మరింత బిజీ కావడం విశేషం. ఇక రాజశేఖర్ కూడా తన తదుపరి ప్రాజెక్టును సెట్ చేసుకునే పనిలో వున్నారు.       

More Telugu News