nagachaitanya: 'సవ్యసాచి'లో చైతూ లుక్ కొత్తగా ఉంటుంది: చందూ మొండేటి

  • చైతూ నటనలో కొత్త కోణం కనిపిస్తుంది  
  • ఎమోషన్స్ కి ప్రాధాన్యత 
  • టైటిల్ కి న్యాయం చేసేలా ఉంటుంది  

తొలి చిత్రం 'కార్తికేయ'తోనే దర్శకుడిగా తానేమిటనేది చందూ మొండేటి నిరూపించుకున్నాడు. ఆ తరువాత ఆయన తెరకెక్కించిన 'ప్రేమమ్' సినిమా కూడా ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా యూత్ లో ఆయనకి మరింత క్రేజ్ ను తెచ్చిపెట్టింది. ఈ నేపథ్యంలో ఆయన తన మూడవ సినిమాగా 'సవ్యసాచి'ని సెట్స్ పైకి తీసుకెళ్లాడు. నాగచైతన్య కథానాయకుడిగా ఈ సినిమా రూపొందుతోంది.

ఈ సినిమాలో చైతూ చాలా కొత్తగా కనిపిస్తాడనీ .. ఆయన నటనలో కొత్తకోణం ఈ సినిమాలో కనిపిస్తుందని చందూ మొండేటి అన్నాడు. టైటిల్ కి న్యాయం చేసేలా ఈ సినిమా ఉంటుందనీ, యాక్షన్ తో పాటు ఎమోషనల్ సీన్స్ కూడా ఆడియన్స్ కి కనెక్ట్ అవుతాయని చెప్పాడు. ఎమోషనల్ సీన్స్ ఈ సినిమాకి ప్రత్యేకంగా నిలుస్తాయని అన్నాడు. నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాకి, కీరవాణి సంగీతాన్ని అందిస్తోన్న సంగతి తెలిసిందే.   

More Telugu News