gopichand: వినాయక్ క్లాప్ తో గోపీచంద్ న్యూ మూవీ ప్రారంభం

  • చక్రి దర్శకత్వంలో గోపీచంద్
  • రామానాయుడు స్టూడియోలో ప్రారంభం  
  • పూర్తిస్థాయి యాక్షన్ ఎంటర్టైనర్ 
  • హీరోయిన్ గా మెహ్రీన్    

కొంతకాలంగా గోపీచంద్ సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ నేపథ్యంలో దర్శకుడు చక్రి వినిపించిన కథ నచ్చడంతో, వెంటనే ఆయన ఓకే చెప్పేశాడు. ఈ సినిమాను నిర్మించడానికి కె.కె.రాధామోహన్ ముందుకు వచ్చారు. ఈ సినిమాలో కథానాయిక పాత్ర కోసం మెహ్రీన్ ను ఎంపిక చేసుకున్నారు. ఈ కాంబినేషన్లో ఈ సినిమా ఈ రోజున పూజా కార్యక్రమాలను జరుపుకుంది.

 హైదరాబాద్ - రామానాయుడు స్టూడియోలో ఈ కార్యక్రమం జరిగింది. నాయకా నాయికలపై వినాయక్ క్లాప్ కొట్టడంతో, ముహూర్తపు సన్నివేశాన్ని చిత్రీకరించారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రూపొందుతోంది. గోపీచంద్ ఖాతాలో యాక్షన్ ఎంటర్టైనర్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఈ తరహా సినిమాలే ఆయనకి ఎక్కువగా సక్సెస్ లు తెచ్చిపెట్టాయి కూడా. మరి ఈ సారి కూడా ఈ సినిమాతో గోపీచంద్ కి హిట్ పడుతుందేమో చూడాలి మరి.   

More Telugu News