India: 3 మిల్లీ సెకన్లలో 5.7 జీబీపీఎస్: ఇండియాలో తొలిసారి 5జీ లైవ్ చూపిన ఎరిక్ సన్

  • 5వ తరం రేడియో తరంగాల లైవ్
  • 2026 నాటికి 27.3 బి. డాలర్ల వ్యాపారం
  • రెండేళ్లలో సేవలను ప్రారంభిస్తాం
  • వెల్లడించిన ఎరిక్ సన్

3 మిల్లీ సెకన్లు... అంటే కనీసం రెప్పపాటు సమయం కూడా కాదు. అంత తక్కువ సమయంలో ఏం చేస్తాం? 5వ తరం రేడియో తరంగాలు ఏం చేయగలవో ఇండియాలో తొలిసారిగా లైవ్ చూపించింది ఎరిక్ సన్ సంస్థ. తమ 5జీ టెస్ట్ బెడ్ పై సెకనులో 3వ వంతు కన్నా తక్కువ సమయంలో 5.7 బీబీపీఎస్ ఇంటర్నెట్ స్పీడ్ ను చూపి ఓ అద్భుతాన్ని కళ్లముందు చూపింది.

భారత మార్కెట్లో 2026 నాటికి 5జీ సాంకేతికత 27.3 బిలియన్ డాలర్ల వ్యాపారం నమోదు చేసేంత స్థాయికి చేరుతుందని అంచనా వేస్తున్నట్టు వ్యాఖ్యానించిన ఎరిక్ సన్, భారత మార్కెట్లో తమ సంస్థ తొలిసారిగా లైవ్ 5జీ స్పీడ్ ను చూపించిందని తెలిపింది. భారత మార్కెట్లో అపార వ్యాపారావకాశాలు ఉన్నాయని, సాధ్యమైనంత ఎక్కువ మార్కెట్ వాటాను నమోదు చేయడమే తమ లక్ష్యమని ఎరిక్ సన్, మార్కెట్ ఏరియా హెడ్ నుంజియో మిర్టిల్లో వ్యాఖ్యానించారు.

మరో రెండేళ్లలో ఇండియాలో 5జీ సేవలను తాము ప్రారంభించనున్నామని ఆయన పేర్కొన్నారు. ఇండియాలో గిగాబిట్ ఎల్టీఈ విస్తరణ కోసం తాము వేచి చూస్తున్నామని తెలిపారు. 5జీ తరంగాలు అందుబాటులోకి వస్తే, ఇప్పుడున్న టెలికం ఆదాయం 43 శాతం మేరకు పెరుగుతుందని ఎరిక్ సన్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ నితిన్ బన్సాల్ వెల్లడించారు.

More Telugu News