nakka ananda babu: రాష్ట్రాభివృద్ధిని అడ్డుకునేందుకు జ‌గ‌న్ ప్ర‌య‌త్నాలు: ఏపీ మంత్రి న‌క్కా ఆనంద బాబు ఆరోపణ

  • జ‌గ‌న్‌పై మంత్రి న‌క్కా ఆనందబాబు ఆగ్ర‌హం
  • రాజ‌ధాని నిర్మాణంపై జ‌గ‌న్ ఎన్జీటీలో పిటిష‌న్ వేయించారు
  • రాష్ట్రాభివృద్ధి కోసం సీఎం చంద్ర‌బాబు అహ‌ర్నిశ‌లు కృషి చేస్తున్నారు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిపై ఆంధ్ర‌ప్ర‌దేశ్ మంత్రి న‌క్కా ఆనందబాబు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రాష్ట్రాభివృద్ధిని అడ్డుకునేందుకు జ‌గ‌న్ ప్ర‌య‌త్నాలు జ‌రుపుతున్నార‌ని ఆయ‌న అన్నారు. ఈ రోజు ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న న‌క్కా ఆనంద‌బాబు మీడియాతో మాట్లాడుతూ... తాము ఎంత‌గానో కృషి చేసి రాజ‌ధాని నిర్మాణాన్ని చేప‌ట్టాల‌నుకుంటుంటే దాన్ని అడ్డుకునేందుకు జ‌గ‌న్ ఎన్జీటీలో పిటిష‌న్ వేయించారని చెప్పారు. కాగా, రాష్ట్రాభివృద్ధి కోసం సీఎం చంద్ర‌బాబు నాయుడు అహ‌ర్నిశ‌లు ప‌నిచేస్తున్నారని న‌క్కా ఆనంద‌బాబు అన్నారు. 

More Telugu News