Cricket: ముక్కోణ‌పు సిరీస్ ఆడ‌నున్న టీమిండియా!

  • వచ్చే ఏడాది శ్రీలంక 70వ స్వాతంత్ర్య దినోత్స‌వ వేడుక‌లు
  • బీసీసీఐ, బంగ్లాదేశ్ క్రికెట్‌ బోర్డులతో శ్రీలంక‌ సంప్రదింపులు
  • మార్చి 8 నుంచి 20 మధ్య ముక్కోణపు టోర్నీ

వచ్చే ఏడాది శ్రీలంక 70వ స్వాతంత్ర్య దినోత్స‌వ వేడుక‌లు జ‌రుపుకోనుంది. ఈ నేప‌థ్యంలో ముక్కోణపు సిరీస్‌ నిర్వహించడం ప‌ట్ల ఆస‌క్తి చూపిన‌ బీసీసీఐ, బంగ్లాదేశ్ క్రికెట్‌ బోర్డులతో సంప్రదింపులు జరిపి విజ‌య‌వంత‌మైంది. శ్రీలంక కోరిక మేర‌కు భార‌త్, బంగ్లాదేశ్‌ బోర్డులు వచ్చే ఏడాది మార్చి 8 నుంచి 20 మధ్య ముక్కోణపు టోర్నీ నిర్వహిస్తామ‌ని తెలిపాయి.

ఈ సిరీస్‌పై శ్రీలంక క్రికెట్ బోర్డు ప్ర‌తినిధులు మాట్లాడుతూ... కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో ఈ మ్యాచ్‌లు జరగనున్నాయని తెలిపారు. ఇందులో భాగంగా ప్రతి జట్టు మిగతా రెండు జట్లతో రెండేసి మ్యాచులు ఆడుతుందని చెప్పారు. అన్ని మ్యాచ్‌లు సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు.   

More Telugu News