nara brahmini: రక్తదానం చేసిన నారా బ్రాహ్మణి, ఉపాసన!

  • ఈ మధ్యాహ్నం రక్తదానం చేసిన బ్రాహ్మణి, ఉపాసన
  • 18 ఏళ్ల వయసులో రక్తదానం చేయడాన్ని ప్రారంభించండి
  • 500 మందిని బతికిస్తారు

ఏపీ మంత్రి నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి, హీరో రామ్ చరణ్ సతీమణి ఉపాసనలు రక్తదానం చేసి, ఇతరుల్లో చైతన్యం నింపారు. తాము రక్తదానం చేసిన విషయాన్ని ఉపాసన ఫేస్ బుక్ ద్వారా పంచుకున్నారు. ఈ మధ్యాహ్నం తాను, బ్రాహ్మణి రక్తదానం చేశామని తెలిపారు. 18 ఏళ్ల వయసులో రక్తదానం చేయడాన్ని మీరు ప్రారంభిస్తే ప్రతి 90 రోజులకు ఒక్కసారి 60 ఏళ్లు వచ్చే వరకు రక్తదానం చేయవచ్చని ఈ సందర్బంగా బ్రాహ్మణి చెప్పినట్టు ఉపాసన తెలిపారు. 500 జీవితాలను కాపాడే సత్తా మీకు ఉంటుందని చెప్పారని అన్నారు. ఇది ఎంతో శక్తిమంతమైన సహాయం అని, మనకు ఎంతో సంతృప్తిని ఇస్తుందని ఉపాసన తెలిపారు.

More Telugu News