jd lakshminarayana: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ ఇంట్లో భారీ చోరీ!

  • లక్ష్మీనారాయణ బంజారాహిల్స్ నివాసంలో చోరీ
  • పీఎస్ లో ఫిర్యాదు
  • పని మనుషులపైనే అనుమానం

సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ ఇంట్లో భారీ చోరీ జరిగింది. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని ఆయన నివాసంలో బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. ఈ మేరకు లక్ష్మీనారాయణ కుటుంబసభ్యులు ఈ రోజు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం లక్ష్మీనారాయణ మహారాష్ట్ర అదనపు డీజీపీగా విధులు నిర్వహిస్తున్నారు. అయితే, ఇంట్లో పని చేసేవారే ఈ చోరీకి పాల్పడినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

More Telugu News