girls: 14 మంది బాలిక‌ల‌ను కుట్టిన విష పురుగులు.. ఉబ్బిపోయిన బాలిక‌ల ముఖాలు

  • నిజామాబాద్ మండలం మోపాల్ మైనారిటీ గురుకుల ఆశ్రమ పాఠశాలలో ఘ‌ట‌న‌
  • విద్యార్థినుల‌కు ఆసుపత్రిలో చికిత్స‌
  • భ‌యాందోళ‌న‌ల‌కు గుర‌వుతోన్న బాలిక‌లు

విష పురుగుల కాటుకు గురై 14 మంది బాలిక‌ల ముఖాలు ఉబ్బిపోయిన వైనం నిజామాబాద్ మండలం మోపాల్ మైనారిటీ గురుకుల ఆశ్రమ పాఠశాలలో చోటు చేసుకుంది. స‌ద‌రు ఆశ్రమ పాఠశాల పక్కనే పొలాలు ఉన్నాయి. అందులో పెరిగే పురుగులే పాఠ‌శాల‌లోకి వ‌స్తున్నాయి. తాజాగా ఆ పొలంలో పురుగుల మందు కొట్టారు. దీంతో అందులోని ఈ విష కీటకాలు అక్క‌డి నుంచి ఆశ్రమ పాఠశాల వైపు వచ్చాయి. విద్యార్థినుల‌ను అవి కుట్ట‌డంతో అల‌జ‌డి చెల‌రేగింది. బాధిత విద్యార్థినులంద‌రినీ ఆసుప‌త్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. ఈ ఘ‌ట‌నతో బాలిక‌లు భ‌యాందోళ‌న‌ల‌కు గుర‌వుతున్నారు. 

More Telugu News