sundeep kishan: ఆల్రెడీ ప్లాప్ టాక్ వచ్చేసింది .. అయినా మళ్లీ రీషూట్ చేసి, రిలీజ్ చేస్తారట!

  • కోలీవుడ్ లోను సందీప్ కిషన్ కి నిరాశే 
  • మెహ్రీన్ సీన్స్ లేపేసినా ప్రయోజనం శూన్యం 
  • కొత్త సీన్స్ యాడ్ చేసే ప్రయత్నం  
  • మళ్లీ రిలీజ్ చేసే ఆలోచన      

సందీప్ కిషన్ .. మెహ్రీన్ జంటగా దర్శకుడు సుశీంద్రన్ తమిళ .. తెలుగు భాషల్లో ఒక సినిమాను రూపొందించాడు. తమిళంలో 'నెంజిల్ తునివిరుందల్' పేరుతో ఈ నెల 10వ తేదీన విడుదలైన ఈ సినిమా, తెలుగులో 'కేరాఫ్ సూర్య' పేరుతో అదే రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళంలో ఈ సినిమా చూసిన ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారట. దాంతో హీరోయిన్ కి సంబంధించిన కొన్ని సీన్స్ కథకి అడ్డొస్తున్నాయని అవి లేపేశారట. ఈ విషయమై మెహ్రీన్ ఫీల్ కావడం .. దర్శకుడు సారీ చెప్పడం జరిగిపోయాయి కూడా.

 అయితే ఇలా సినిమాలోని కొన్ని సీన్స్ ఎత్తేయడం వలన కథ పట్టాలు తప్పినట్టుగా అనిపించిందట. దాంతో ఈ సినిమాను థియేటర్స్ లో నుంచి తీసేయడానికి నిర్మాతలు నిర్ణయించుకున్నారని టాక్. రీ షూట్ చేసి .. కొన్ని సీన్స్ ను యాడ్ చేసి, వచ్చేనెల 15వ తేదీన మళ్లీ ఈ సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నట్టుగా సమాచారం. ఇదేదో ముందుగానే చేస్తే బాగుండేది .. ఇప్పుడు మార్పులు చేయడం వలన ప్రయోజనం ఉంటుందా? అనేది కోలీవుడ్ లో వినిపిస్తోన్న మాట .        

More Telugu News