boat accident: కృష్ణానదిలో మరో బోటు ప్రమాదం.. అంతా సేఫ్!

  • గుంటూరు జిల్లా పెనుమాక వద్ద ప్రమాదం
  • బోల్తా కొట్టిన పడవ
  • ప్రాణాలను కాపాడుకున్న కార్మికులు

విజయవాడ వద్ద కృష్ణా నదిలో జరిగిన బోటు ప్రమాదంలో 22 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనను మరవక ముందే కృష్ణానదిలో మరో పడవ ప్రమాదం చోటు చేసుకుంది. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాక వద్ద ఈ ప్రమాదం జరిగింది. నదిలోని ఇసుకను పడవలోకి నింపి తీసుకొస్తుండగా పడవ ఒక్కసారిగా బోల్తా కొట్టింది. ఆ సమయంలో పడవలో ఉన్న కార్మికులు కిందకు దూకి ఒడ్డుకు చేరడంతో ప్రమాదం తప్పింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి సమీపంలోనే ఈ ఘటన జరిగింది. 

More Telugu News