flight: విమానాన్ని ఢీ కొట్టిన పక్షి.. అత్యవసర ల్యాండింగ్

  • చెన్నై నుంచి దోహా బయల్దేరిన విమానం
  • కాసేపటికే విమానాన్ని ఢీ కొట్టిన పక్షి 
  • సురక్షితంగా ఎమర్జెన్సీ ల్యాండింగ్

ప్రైవేటు విమానాన్ని పక్షి ఢీ కొట్టడంతో అత్యవసరంగా ల్యాండ్ చేసిన ఘటన చెన్నైలో చోటుచేసుకుంది. దాని వివరాల్లోకి వెళ్తే... చెన్నై విమానాశ్రయం నుంచి గత రాత్రి 1:45 నిమిషాలకు 134 మంది ప్రయాణికులతో దోహా వెళ్లేందుకు ఓ విమానం టేకాఫ్ తీసుకుంది. కాసేపటికే విమానాన్ని పక్షి ఢీ కొట్టింది. దీంతో ఏటీసీ అధికారులను సంప్రదించిన పైలట్ 2:10 నిమిషాలకు తిరిగి చెన్నై విమానాశ్రయంలో విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండ్ చేశారు. పక్షి ఢీ కొట్టడంతో ఆందోళన చెందామని, క్షేమంగా ల్యాండ్ కావడంతో హాయిగా ఊపిరిపీల్చుకున్నామని ప్రయాణికులు తెలిపారు. 

More Telugu News