america: యూఎస్ లో భారతీయ విద్యార్థి హత్య!

  • ఫ్రెస్నో సిటీలో గ్యాస్ స్టేషన్ దోచుకునేందుకు వెళ్లిన నలుగురు దుండగులు
  • దోపిడీని చూసి పక్కనున్న దుకాణంలో క్యాష్ కౌంటర్ చాటున దాక్కున్న ధరమ్ ప్రీత్ జస్సేర్
  • ధరమ్ ప్రీత్ ను గుర్తించి కాల్చి చంపిన దుండగుడు

అమెరికాలో తుపాకి సంస్కృతికి భారతీయ విద్యార్థి ప్రాణాలు కోల్పోయిన ఘటన కాలిఫోర్నియాలో చోటుచేసుకుంది. కాలిఫోర్నియాలోని ఫ్రెస్నో నగరంలోని ఒక దుకాణంలో ప్రవాస భారతీయ విద్యార్థి ధరమ్ ప్రీత్ జస్సేర్ (21) విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆయన పని చేసే దుకాణం పక్కనున్న గ్యాస్‌ స్టేషన్‌ ను దోచుకునేందుకు నలుగురు దుండగులు వచ్చారు. వారిని చూసిన ధరమ్‌ ప్రీత్‌ తన దుకాణంలోని క్యాష్‌ కౌంటర్‌ వద్ద దాక్కున్నాడు.

అతనిని గుర్తించిన దుండగుడు తుపాకితో కాల్చి హత్య చేశాడు. మరుసటి రోజు సరుకులు కొనుగోలు చేసేందుకు వచ్చిన వ్యక్తి, రక్తపు మడుగులో వున్న అతనిని చూసి, పోలీసులకు సమాచారం అందించడంతో దారుణం వెలుగులోకి వచ్చింది. గ్యాస్ స్టేషన్ లో రికార్డైన సీసీ పుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు నలుగురు అనుమానితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. అయితే అతను భారతసంతతికి చెందిన అత్వాల్ (22) కావడం విశేషం. పంజాబ్ రాష్ట్రానికి చెందిన ధరమ్ ప్రీత్ జస్సేర్ మూడేళ్ల క్రితం చదువుకునేందుకు విద్యార్థి వీసాపై అమెరికా వెళ్లారు. 

More Telugu News