gold: మూడు రోజుల త‌రువాత‌.. కాస్త త‌గ్గిన బంగారం ధ‌ర!

  • ప‌ది గ్రాముల‌ బంగారం ధ‌ర‌ రూ.100 తగ్గి, రూ.30,525గా న‌మోదు
  • కిలో వెండి ధర రూ.75 తగ్గి, రూ.40,650గా న‌మోదు

మార్కెట్లో ఈ రోజు బంగారం ధ‌ర కాస్త త‌గ్గింది. అంతర్జాతీయ పరిస్థితులు, స్థానిక బంగారు ఆభరణాల తయారీదారుల నుంచి డిమాండ్ త‌గ్గిపోవ‌డంతో ప‌ది గ్రాముల‌ బంగారం ధ‌ర‌ రూ.100 తగ్గి, రూ.30,525గా న‌మోదైంది. మూడు రోజుల నుంచి బంగారం ధ‌ర‌ పెరుగుతూ వ‌చ్చి, ఈ రోజు మాత్రం కింది చూపులు చూసింది.

మరోవైపు కిలో వెండి ధర రూ.75 తగ్గి, రూ.40,650గా న‌మోదైంది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ త‌గ్గిపోవ‌డంతో వెండి ధర కాస్త త‌గ్గింద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. ఇక‌ గ్లోబ‌ల్ మార్కెట్‌లో ప‌సిడి ధర 0.07శాతం త‌గ్గి, ఔన్సు 1,276.70 డాలర్లుగా న‌మోదైంది. 

More Telugu News