karnisena: 'ప‌ద్మావ‌తి' హీరోయిన్ దీపిక ప‌దుకునేని చంపితే రూ.5 కోట్లు ఇస్తాం: క‌ర్ణిసేన ప్ర‌క‌ట‌న‌

  • వివాదాల చుట్టూ తిరుగుతోన్న బాలీవుడ్ సినిమా పద్మావతి
  • ఈ సినిమాను విడుద‌ల చేస్తే తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోక త‌ప్ప‌ద‌ని హెచ్చ‌రిక‌లు
  • ఇప్ప‌టికే హీరోయిన్ ముక్కు కోయాల‌ని క‌ర్ణిసేన పిలుపు

షూటింగ్ ప్రారంభించింది మొద‌లు వివాదాల చుట్టూ తిరుగుతోన్న బాలీవుడ్ సినిమా 'పద్మావతి'ని వ‌చ్చే నెల 1న విడుద‌ల చేయాల‌ని చూస్తోన్న విష‌యం తెలిసిందే. మరోపక్క, ఈ సినిమాను విడుద‌ల చేస్తే తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోక త‌ప్ప‌ద‌ని హెచ్చ‌రిక‌లు వ‌స్తున్నాయి. ఈ సినిమాలో న‌టించిన‌ దీపికా పదుకునేను చంపితే రూ.5 కోట్లు ఇస్తామని క‌ర్ణిసేన‌ సంస్థ ప్రకటించింది.

ఆ హీరోయిన్ ముక్కుకోయాల‌ని, ఆ సినిమా ప్ర‌ద‌ర్శిత‌మ‌య్యే సినిమా థియేట‌ర్ల‌ను ద‌గ్ధం చేయాల‌ని ఇప్ప‌టికే దేశ వ్యాప్తంగా కొన్ని సంఘాలు హెచ్చ‌రించిన విష‌యం తెలిసిందే. ద‌ర్శ‌కుడు సంజయ్‌లీలా భన్సాలీ తీసిన ఈ సినిమాలో హిందువుల మనోభావాలను దెబ్బతీశారని ఆరోప‌ణ‌లు ఉన్నాయి.  

More Telugu News