china open: చైనా ఓపెన్ సూప‌ర్ సిరీస్ నుంచి నిష్క్రమించిన సైనా, ప్ర‌ణయ్‌... మూడో రౌండ్‌కి చేరుకున్న సింధు

  • రెండో రౌండ్‌లో ఓడిపోయిన సైనా, ప్ర‌ణ‌య్‌
  • అతిక‌ష్టం మీద గెలిచిన సింధు
  • 2014లో చైనా ఓపెన్ సూప‌ర్ సిరీస్ గెలిచిన సైనా

చైనా ఓపెన్ సూప‌ర్ సిరీస్ మ‌హిళ‌ల సింగిల్స్ నుంచి భార‌త స్టార్ ష‌ట్ల‌ర్ సైనా నెహ్వాల్ నిష్క్ర‌మించింది. రెండో రౌండ్‌లో జ‌పాన్ క్రీడాకారిణి అకానే య‌మ‌గూచి చేతిలో 21-18, 21-11 తేడాతో ఓటమి పాలైంది. ఈ సీజ‌న్‌లో య‌మ‌గూచితో సైనా ఐదు సార్లు త‌ల‌ప‌డింది. వాటిలో ఒక్క‌సారి మాత్ర‌మే సైనా విజ‌యం సాధించింది. గతంలో 2014లో జ‌రిగిన చైనా ఓపెన్ సూప‌ర్ సిరీస్‌ను గెలుచుకున్న సైనా, రెండో రౌండ్లోనే నిష్క్ర‌మించ‌డంతో అభిమానులు అసంతృప్తికి గుర‌య్యారు.

మ‌రోవైపు పురుషుల సింగిల్స్‌లో హెచ్ఎస్ ప్ర‌ణ‌య్ కూడా రెండో రౌండ్లో ఓట‌మి పాల‌య్యాడు. చైనా క్రీడాకారుడు చూక్ యూ లీ చేతిలో 21-19, 21-17 తేడాతో ప్ర‌ణ‌య్ ఓడిపోయాడు. ఇక ప్ర‌పంచ నెం. 2 బ్యాడ్మింట‌న్ స్టార్ పీవీ సింధు మాత్రం రెండో రౌండ్లో అద్భుత విజ‌యం సాధించింది. జ‌పాన్ క్రీడాకారిణి స‌యాకో సాటోను సింధు అతిక‌ష్టం మీద ఓడించింది. వీరి మ‌ధ్య 24-22, 23-21 పాయింట్ల తేడా మాత్ర‌మే ఉంది. మూడో రౌండ్లో చైనా క్రీడాకారిణి హాన్ యూతో సింధు త‌ల‌ప‌డ‌నుంది.

More Telugu News