Jana Reddy: అస్వస్థత‌కు గురైన జానారెడ్డి.. ఆసుప‌త్రికి త‌ర‌లింపు

  • అసెంబ్లీ సమావేశాలకు హాజరైన జానారెడ్డి
  • ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నట్టు స‌మాచారం
  • ఆసుపత్రిలో చికిత్స కొనసాగింపు 

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ఒక్క‌సారిగా అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. ఈ రోజు అసెంబ్లీ సమావేశాలకు ఆయ‌న వ‌చ్చారు. అదే స‌మ‌యంలో అక్కడే అనారోగ్యానికి గురయ్యారు. దీంతో జానారెడ్డిని అక్క‌డి నుంచి ద‌గ్గ‌ర‌లోని ఆసుప‌త్రికి త‌ర‌లించి, చికిత్స అందిస్తున్నారు. జానారెడ్డి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. ఈ ఘటన గురించి పూర్తి స‌మాచారం అందాల్సి ఉంది. జానారెడ్డి అసెంబ్లీలో ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా ఉన్న విష‌యం తెలిసిందే.  

More Telugu News