India: మొద‌టి టెస్టు: మ‌్యాచ్‌ను ఆపేసిన అంపైర్లు

  • వ‌ర్షంతో పాటు వెలుతురు లేమి కార‌ణం
  • రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా
  • ఓపెన‌ర్ లోకేశ్ రాహుల్, శిఖ‌ర్ ధావ‌న్ ఔట్‌
  • టీమిండియా స్కోరు 8.2 ఓవ‌ర్ల‌కి 17

కోల్‌క‌తాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జ‌రుగుతోన్న భార‌త్, శ్రీలంక మొదటి టెస్టు మ్యాచు తొలి రోజు ఆట‌కి వ‌ర్షంతో పాటు, వెలుతురు లేమి అడ్డంకిగా మారింది. దీంతో అంపైర్లు మ్యాచ్‌ను ఆపివేశారు. మైదానంలో చినుకులు ప‌డ‌కుండా సిబ్బంది కవర్లతో కప్పారు.

టాస్ ఓడి బ్యాటింగ్ చేస్తోన్న టీమిండియా తొలి ఓవ‌ర్ తొలి బంతికే లోకేశ్ రాహుల్‌ వికెట్ కోల్పోయిన విష‌యం తెలిసిందే. 6.2వ ఓవర్‌లో లక్మల్‌ బౌలింగ్‌లో ధావన్ 8 ప‌రుగుల వ్య‌క్తిగ‌త స్కోరు వ‌ద్ద ఔట‌య్యాడు. 8.2 ఓవర్ల వద్ద టీమిండియా 17 పరుగులు చేసింది. క్రీజులో పుజారా 8, విరాట్‌ కోహ్లీ 0 ప‌రుగుల‌తో ఉన్నారు.

More Telugu News