padmavathi movie: 'పద్మావతి' విడుదలను నిరసిస్తూ.. డిసెంబర్ 1న భారత్ బంద్ కు పిలుపు!

  • 'పద్మావతి' సినిమాకు నిరసనల సెగ
  • భారత్ బంద్ కు పిలుపునిచ్చిన రాజ్ పుత్ కర్ణి సేన
  • విడుదలను అడ్డుకుని తీరుతామంటూ హెచ్చరిక

ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ నిర్మించిన 'పద్మావతి' చిత్రం విడుదలకు ముందే వేడిని పుట్టిస్తోంది. ఈ సినిమా విడుదలను ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించబోమని రాజ్ పుత్ కర్ణిసేన స్పష్టం చేసింది. ఈ చిత్రం విడుదలను నిరసిస్తూ రాజ్ పుత్ కర్ణి సేన డిసెంబర్ 1న భారత్ బంద్ కు పిలుపునిచ్చింది. రాజ్ పుత్ కర్ణి సేన నేత లోకేంద్ర సింగ్ కల్వి మాట్లాడుతూ, సినిమా విడుదలకు నిరసనగా బంద్ కు పిలుపునిచ్చారు.

ఈ ఉదయం బెంగళూరులో ఈ సేనకు చెందిన సభ్యులు సినిమాకు వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే రామ్ కదమ్ మాట్లాడుతూ, సినిమా విడుదలను అడ్డుకుని తీరుతామని చెప్పారు.

More Telugu News