train accident: కాంగోలో ఘోర రైలు ప్రమాదం.. 33 మంది మృతి!

  • బోగీలకు నిప్పు అంటుకోవడంతో రైలు ప్రమాదం
  • సంఘటనా స్థలికి చేరుకున్న సహాయక బృందాలు
  • 30 కిలోమీటర్ల దూరంలోని లుబుడి ఆసుపత్రికి క్షతగాత్రుల తరలింపు

కాంగోలో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. బోగీలకు నిప్పు అంటుకోవడంతో ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. కాగా, ఈ ప్రమాదంలో 33 మంది మృతి చెందగా, 26 మంది తీవ్ర గాయాలపాలైనట్టు సమాచారం. సంఘటనా స్థలికి చేరుకున్న సహాయక సిబ్బంది... అక్కడికి 30 కిలోమీటర్ల దూరంలోని లుబుడి ఆసుపత్రికి క్షతగాత్రులను తరలించి, చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. కాగా, దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

More Telugu News