boat accident: అధికారుల కంటే మత్స్యకారులే నయం: ప్రత్యక్ష సాక్షులు

  • ప్రమాదం జరిగిన వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చిన మత్స్యకారులు, స్థానికులు
  • సంఘటనా స్థలికి వచ్చేసరికి అరగంట ఆలస్యం
  • అప్పటికే బాధితులను ఆసుపత్రులకు తరలించిన స్థానికులు, మత్స్యకారులు

పవిత్ర సంగమం వద్ద జరిగిన బోటు ప్రమాదంలో అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనబడిందని ఈ ఘటనకు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిందని స్థానికులు, మత్స్యకారులు సమాచారం ఇచ్చిన అరగంటవరకు ఎవరూ సంఘటనా స్థలికి రాలేదని వారు చెప్పారు. వచ్చిన తరువాత కూడా బాధితులను రక్షించడంలో ఆలస్యం చేశారని వారు మండిపడ్డారు.

మత్స్యకారులు, స్థానికులే వారిని ఆసుపత్రికి తీసుకెళ్లే ప్రయత్నాలు చేశారని పలువురు వ్యాఖ్యానించారు. ఆ తర్వాత ఎప్పటికో తీరిగ్గా అధికారులు వచ్చారని ప్రత్యక్ష సాక్షులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు బాధ్యతారాహిత్యంగా ఉన్నారని, ఎన్డీఆర్ఎఫ్ దళాలు గాలింపు చేపట్టాయని, ఆ తరువాత అధికారులు దానిని పర్యవేక్షించారని వారు అన్నారు.  

More Telugu News