Vijayawada: విజయవాడ కృష్ణా నదిలో బోటు బోల్తా.. ఐదుగురి మృతి, 10 మంది గల్లంతు

  • ఇబ్రహీంపట్నం ఫెర్రీ వద్ద ప్రమాదం
  • భవానీ ఐలాండ్ నుంచి పవిత్ర సంగమం వైపు వెళుతుండగా విషాదం
  • మృతులు ప్రకాశం జిల్లాకు చెందిన వారిగా గుర్తింపు

విజయవాడలోని కృష్ణా నదిలో ఘోర ప్రమాదం సంభవించింది. భవానీ ఐలాండ్స్ నుంచి పవిత్ర సంగమం వైపు వెళ్తుండగా ఇబ్రహీంపట్నం ఫెర్రీ వద్ద బోటు బోల్తా పడింది. ఈ ఘటనలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. 20 మంది ప్రయాణికులను కాపాడగా, మరో 10 మంది ఆచూకీ ఇంకా లభించలేదు. మొత్తం 35 మంది ప్రయాణికులతో ఈ బోటు బయల్దేరినట్టు తెలుస్తోంది. గల్లంతైన వారి కోసం గజ ఈతగాళ్లు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది గాలిస్తున్నారు. మృతులను ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన వారిగా గుర్తించారు. ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

More Telugu News