chittore: చిత్తూరు, నెల్లూరు జిల్లా వాసులను బెంబేలెత్తించిన భూ ప్రకంపనలు!

  • చిత్తూరు జిల్లా యాదమరి మండలం కృష్ణాపురం గ్రామంలో భూప్రకంపనలు
  • నెల్లూరు జిల్లా పొదలకూరులో కూడా ప్రకంపించిన భూమి 
  • భయంతో ఇళ్లలోంచి వీధుల్లోకి పరుగులు తీసిన ప్రజలు

చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో సంభవించిన భూ ప్రకంపనలు స్థానికులను బెంబేలెత్తించి, ఇళ్లలోంచి పరుగులు తీయించాయి. చిత్తూరు జిల్లా యాదమరి మండలం కృష్ణాపురం గ్రామంతో పాటు నెల్లూరు జిల్లా పొదలకూరు గ్రామాల్లో ఈ ఉదయం భూప్రకంపనలు సంభవించాయి. కాళ్ల కింద భూమి నాలుగు సెకన్ల పాటు కంపించి పోవడంతో బెంబేలెత్తిన ప్రజలు ఇళ్లలోంచి వీధుల్లోకి పరుగులు తీశారు. చాలాసేపు ఇళ్ల బయటే కాలం గడిపారు.   

More Telugu News