Pakistan: గుజరాత్ తీరంలో పాక్ దుశ్చర్య.. 55 మంది భారత జాలర్లను అదుపులోకి తీసుకున్న వైనం

  • వారం రోజుల్లో 79 మంది భారత జాలర్లను అదుపులోకి తీసుకున్న పాక్
  • తమ జలాల్లోకి అక్రమంగా ప్రవేశించారని ఆరోపణ
  • బీఎస్ఎఫ్ అదుపులో 8 మంది పాక్ జాలర్లు

భారత జాలర్లపై పాకిస్థాన్ మరోమారు ప్రతాపం చూపింది. తమ ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించారని ఆరోపిస్తూ గుజరాత్‌కు చెందిన జాలర్లను పెద్ద సంఖ్యలో అదుపులోకి తీసుకుంది. అంతకుముందు భారత్ భూభాగంలోకి వచ్చిన ఎనిమిది మంది పాక్ జాలర్లను బీఎస్ఎఫ్ అదుపులోకి తీసుకోవడంతో ప్రతిగా పాక్ ఈ దుశ్చర్యకు దిగినట్టు తెలుస్తోంది. కచ్‌కు సమీపంలో జాహూ తీరంలో 55 మంది భారత జాలర్లను అదుపులోకి తీసుకున్న పాక్ తీర రక్షక దళం.. తొమ్మిది పడవలను కూడా స్వాధీనం చేసుకుంది. వారం రోజుల వ్యవధిలో మొత్తం 79 మంది భారత జాలర్లను అదుపులోకి తీసుకుంది.

More Telugu News