firing in hyderabad: హైదరాబాద్ శివార్లలో కాల్పుల కలకలం

  • మైలార్ దేవ్ పల్లిలో కాల్పులు
  • బాధితుడి శరీరంలోకి దూసుకెళ్లిన రెండు బుల్లెట్లు
  • తుపాకీకి లైసెన్స్ ఉందని గుర్తించిన పోలీసులు

హైదరాబాద్ శివార్లలోని మైలార్ దేవ్ పల్లిలో తుపాకీ కాల్పులు కలకలం రేపాయి. కింగ్స్ కాలనీలో నివాసం ఉంటున్న ముస్తఫా అనే యువకుడిపై జుబేద్ అనే వ్యక్తి కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటన నిన్న రాత్రి 9 గంటలకు చోటు చేసుకున్నప్పటికీ ఆలస్యంగా వెలుగు చూసింది. జుబేద్ ఆస్తులపై ఆదాయపు పన్ను శాఖకు ముస్తఫా ఫిర్యాదు చేసి, తనిఖీలు చేయించాడన్న అనుమానంతోనే కాల్పులకు పాల్పడ్డాడని పోలీసులు నిర్ధారించారు. ఈ ఘటనలో ముస్తఫా శరీరంలోకి రెండు బుల్లెట్లు దూసుకెళ్లాయి. ప్రస్తుతం ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో అతను చికిత్స పొందుతున్నాడు.

జుబేద్ వాడిన తుపాకీకి లైసెన్స్ ఉందని పోలీసులు గుర్తించారు. అయితే, ఇతనికి నేర చరిత్ర కూడా ఉందని పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

More Telugu News