padmavathi: పద్మావతిపై స్టే ఇవ్వలేం.. సెన్సార్ బోర్డు అన్నీ చూసుకుంటుంది: తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు

  • రాజ్ పుత్ ల మనోభావాలను దెబ్బతీసే విధంగా పద్మావతి ఉందంటూ సుప్రీంకోర్టులో పిటిషన్లు  
  • సీబీఎఫ్సీ అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకుని ధ్రువీకరణ పత్రం ఇస్తుందన్న త్రిసభ్య ధర్మాసనం
  • స్టే ఇచ్చేది లేదని స్పష్టీకరణ

డిసెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానున్న ‘పద్మావతి’ సినిమా విడుదలపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఏదైనా సినిమా విడుదలకు ధ్రువీకరణ పత్రాన్ని ఇచ్చే ముందు సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ ఫిలిం సర్టిఫికేషన్‌ (సీబీఎఫ్సీ) అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకుంటుందని స్పష్టం చేసింది. దీంతో ‘పద్మావతి’ సినిమా విడుదలపై సస్పెన్స్ తొలగిపోయింది.

కాగా, రాజ్ పుత్ ల మనోభావాలను ‘పద్మావతి’ సినిమాలో దెబ్బతీశారని, చరిత్రకు విరుద్ధంగా ఈ సినిమాను రూపొందించారని, తక్షణం ఆ సినిమా విడుదలపై స్టే విధించాల్సిందిగా కోరుతూ, సిద్ధరాజ్‌ సిన్హ్‌తో పాటు 11 మంది సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిని చీఫ్‌ జస్టిస్‌ దీపక్‌ మిశ్రా, జస్టిస్‌ ఎంకే ఖాన్‌ విల్కర్‌, డీవై చంద్రచూడ్‌ లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా ఈ సినిమా విడుదలపై స్టే విధించబోమని తేల్చిచెప్పింది. దీంతో ఈ సినిమా విడుదలకు ఉన్న న్యాయపరమైన అడ్డంకులన్నీ తొలగిపోయినట్టైంది. 

More Telugu News