Cricket: శ్రీలంక‌తో తొలి రెండు టెస్టుల‌కు భార‌త జ‌ట్టు ప్ర‌క‌ట‌న

  • భార‌త్, శ్రీలంక మ‌ధ్య మూడు టెస్టు మ్యాచుల సిరీస్‌
  • ఈ నెల 16 నుంచి టెస్టు సిరీస్ ప్రారంభం
  • టీమిండియా ఆల్ రౌండ‌ర్ హార్దిక్ పాండ్యాకు విశ్రాంతి

ఈ నెల 16 నుంచి టీమిండియా, శ్రీలంక క్రికెట్ జ‌ట్ల మ‌ధ్య టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. ఇరు జ‌ట్ల మ‌ధ్య మొత్తం మూడు టెస్టు మ్యాచులు జ‌ర‌గ‌నున్నాయి. తొలి రెండు టెస్టు మ్యాచులకి భార‌త జ‌ట్టును ఈ రోజు ప్ర‌క‌టించారు. టీమిండియా ఆల్ రౌండ‌ర్  హార్దిక్ పాండ్యాకు విశ్రాంతి ఇచ్చారు. జ‌ట్టులో విరాట్ కోహ్లీ (కెప్టెన్‌), కేఎల్ రాహుల్‌, ముర‌ళీ విజ‌య్‌, శిఖ‌ర్ ధావ‌న్, చ‌టేశ్వ‌ర పుజారా, అజింక్యా ర‌హానె (వైస్ కెప్టెన్‌),  రోహిత్ శ‌ర్మ‌, వృద్ధి మాన్ సాహా (వికెట్ కీప‌ర్‌), అశ్విన్‌, ర‌వీంద్ర జ‌డేజా, కుల్దీప్ జాద‌వ్, మొహ‌మ్మ‌ద్ షమి, ఉమేశ్ యాద‌వ్, భువ‌నేశ్వ‌ర్ కుమార్, ఇషాంత్ శ‌ర్మ‌ ఉన్నారు.    

More Telugu News