Hyderabad: హైద‌రాబాద్ పాత‌బ‌స్తీలో బాలిక‌ల‌కు బలవంతపు పెళ్లిళ్లు చేస్తోన్న ముఠా.. 25 మంది అరెస్టు!

  • న‌కిలీ ప‌త్రాల‌తో మైన‌ర్ల‌ను మేజ‌ర్లుగా మారుస్తోన్న ముఠా
  • ఒప్పంద వివాహాలు చేస్తోన్న వైనం
  • 48 మంది ద‌ళారుల‌పై కేసు
  • 25 మంది అరెస్టు

న‌కిలీ ప‌త్రాల‌తో మైన‌ర్ బాలిక‌ల‌ను మేజ‌ర్లుగా మారుస్తూ బలవంతపు పెళ్లిళ్లు చేస్తోన్న ఓ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. డీసీపీ స‌త్య‌నారాయ‌ణ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం... ఈ ముఠా స‌భ్యులు ఒప్పంద వివాహాలు చేస్తూ డ‌బ్బు సంపాదించుకుంటున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు ఆ ముఠాకు చెందిన‌ మొత్తం 25 మందిని పోలీసులు అరెస్టు చేశారు. మొత్తం 48 మంది ద‌ళారుల‌పై కేసు న‌మోదు చేశారు. అరెస్టైన వారిలో బిపాషా, ర‌షీదా అనే ఇద్ద‌రు మ‌హిళా ద‌ళారులు, ఇద్ద‌రు బ‌హ్రెయ‌న్ దేశ‌స్తులు, ఒక ఖాజీ కూడా ఉన్నారు. ఈ ముఠా కార‌ణంగా బాధిత‌ బాలిక‌లు ఎన్నో వేధింపుల‌కు గుర‌య్యారు.  

More Telugu News