manchu vishnu: 'ఆచారి అమెరికా యాత్ర' ఫస్టులుక్ వచ్చేస్తోంది

  • హైదరాబాదుతో పాటు మలేసియా, అమెరికాలలో షూటింగ్  
  • కొనసాగుతోన్న చివరి షెడ్యూల్ షూటింగ్  
  • ఈ నెల 23వ తేదీన మంచు విష్ణు పుట్టినరోజు 
  • ఆ రోజున రిలీజ్ కానున్న ఫస్టులుక్

మంచు విష్ణు కథానాయకుడిగా 'ఆచారి అమెరికా యాత్ర' రూపొందుతోంది. ప్రగ్యా జైస్వాల్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా, ప్రస్తుతం చివరి షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటోంది. హైదరాబాద్ .. మలేసియా .. అమెరికాలలో ఈ సినిమాకి సంబంధించిన చిత్రీకరణ కొనసాగుతూ వచ్చింది. వినోదానికి ప్రాధాన్యతనిస్తూ జి.నాగేశ్వర రెడ్డి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

 ఈ నెల 23వ తేదీన మంచు విష్ణు పుట్టినరోజు .. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, ఆ రోజున ఫస్టులుక్ ను రిలీజ్ చేయనున్నారు. సాధ్యమైనంత త్వరలోనే టీజర్ ను కూడా వదలాలనే ఆలోచనలో వున్నారు. గతంలో నాగేశ్వర రెడ్డి - మంచు విష్ణు కాంబినేషన్లో వచ్చిన 'దేనికైనా రెడీ' .. 'ఈడో రకం ఆడో రకం' ఘన విజయాన్ని సాధించాయి. అందువలన సహజంగానే ఈ సినిమాపై కూడా అంచనాలు బాగానే వున్నాయి.       

More Telugu News