ys jagan: అసెంబ్లీ బహిష్కరణపై.. జగన్ పై పులివెందుల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు

  • అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించడంపై ఫిర్యాదు
  • పులివెందుల ప్రజలను మోసం చేశారంటూ కంప్లైంట్
  • ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 కింద కేసు నమోదు చేయాలంటూ విన్నపం

వైసీపీ అధినేత జగన్ పై పులివెందుల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు నమోదైంది. టీడీపీ నేత రామగోపాల్ రెడ్డి ఈ ఫిర్యాదు చేశారు. అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించడం ద్వారా... పులివెందుల ప్రజలను జగన్ మోసం చేశారని ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు. ప్రజల ఓట్లతో గెలుపొందిన జగన్, ప్రజాసమస్యలపై అసెంబ్లీలో చర్చించకుండా, అసెంబ్లీని బహిష్కరించారని అన్నారు. ఈ నేపథ్యంలో, ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 కింద జగన్ పై కేసు నమోదు చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి పులివెందుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 

More Telugu News