sai dharam tej: మెగా ఫ్యాన్స్ సమక్షంలో 'జవాన్' ప్రీ రిలీజ్ ఈవెంట్ .. ముహూర్తం ఖరారు!

  • 'జవాన్' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సన్నాహాలు 
  • హైదరాబాద్ లో ఈ నెల 19వ తేదీన
  • వేదికగా నెక్లెస్ రోడ్ లోని 'పీపుల్స్ ప్లాజా'
  • డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు  

సాయిధరమ్ తేజ్ కథానాయకుడిగా బీవీఎస్ రవి దర్శకత్వంలో 'జవాన్' చిత్రం తెరకెక్కింది. మెహ్రీన్ కథానాయికగా నటించిన ఈ సినిమాను డిసెంబర్ 1వ తేదీన భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నారు. ఈ లోగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరపాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు ముహూర్తంగా ఈ నెల 19వ తేదీని ఫిక్స్ చేశారు. ఆ రోజున హైదరాబాద్ - నెక్లెస్ రోడ్ లోని 'పీపుల్స్ ప్లాజా'లో ఈ వేడుకను నిర్వహించనున్నారు.

మెగా అభిమానులు .. సినీ ప్రముఖుల సమక్షంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్ తన కుటుంబం పట్ల .. దేశం పట్ల బాధ్యత కలిగిన పౌరుడిగా కనిపిస్తాడని దర్శకుడు బీవీఎస్ రవి చెప్పారు. ఈ సినిమా కథను తాను మనసు పెట్టి రాశాననీ .. మనసు పెట్టి తీశానని అన్నారు. తమన్ ఆడియోకి మంచి రెస్పాన్స్ వచ్చిందనీ, తప్పకుండా హిట్ కొడుతుందనే నమ్మకం ఉందంటూ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.      

More Telugu News