Aishwarya Rai: ఏయ్, ఇలారా!...మా ఆవిడ ఫోటోలు ఎలా తీశావో చూపించు!: ఫొటోగ్రాఫర్ పై ఫైర్ అయిన అభిషేక్ బచ్చన్

  • మనీష్ మల్హోత్రా పార్టీకి హాజరైన అభిషేక్, ఐశ్వర్యారాయ్
  • ఫొటోల కోసం ఎగబడ్డ ఫొటోగ్రాఫర్లు 
  • తన భార్య ఫోటోలు ఎలా తీశావో చూపించు అంటూ ఫోటోగ్రాఫర్ ను అడిగిన అభిషేక్

బాలీవుడ్‌ జూనియర్ బచ్చన్ మీడియాకు వార్నింగ్ ఇచ్చాడు. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీశ్‌ మల్హోత్రా ఇచ్చిన పార్టీకి జూనియర్ బచ్చన్ భార్యతో కలిసి వెళ్లాడు. పార్టీ పూర్తైన అనంతరం ఇంటికెళ్లేందుకు తన ఆడి కారు దగ్గరకు చేరగానే మీడియా హడావుడి ప్రారంభమైంది. ఫోటోలకు పోజులివ్వాలని వారిని కోరారు. అనంతరం ఐశ్వర్య కారు ఎక్కుతున్నప్పుడు ఓ ఫొటోగ్రాఫర్ ఫోటోలు తీయడాన్ని గుర్తించిన అభిషేక్... 'ఏయ్ ఇలారా?' అంటూ సదరు ఫోటోగ్రాఫర్ ను పిలిచాడు. ఆమె 'కూర్చుంటున్నప్పుడు ఫోటోలు తీశావా?' అని అడిగాడు.

 తీయలేదని ఫోటోగ్రాఫర్ చెప్పడంతో అనుమానం తీరని అభిషేక్.. కెమెరాలోని ఫోటోలు చూపించాలని అడిగాడు. దీంతో ఆ ఫోటోగ్రాఫర్ వాటిని చూపించడంతో మారు మాట్లాడకుండా వెళ్లిపోయాడు. కాగా, ఈ పార్టీకి ఐశ్వర్యాయ్ మోకాళ్లపైకి ఉండే డెనిమ్ గౌన్ ధరించి హాజరైంది. దీంతో కూర్చునేటప్పుడు తీసిన ఫోటోలు అసభ్యంగా ఉన్నాయేమోనని అభిషేక్ భావించాడు. అందుకే, ఫోటోలు చూపించమని అడిగాడు. 

More Telugu News