sasikala: శశికళ ఆస్తులపై రెండో రోజు కొనసాగుతున్న దాడులు...187 చోట్ల ఒకేసారి దాడులు

  • శశికళ ఆస్తులపై ఐటీ దాడులు
  • 187 ప్రాంతాల్లో ఒకేసారి ఐటీ దాడులు
  • 40 ప్రాంతాల్లో దాడులు పూర్తి.. మరికొన్ని చోట్ల కొనసాగింపు  

కర్ణాటకలోని పరప్పణ అగ్రహార జైలులో అక్రమాస్తుల కేసులో శిక్ష అనుభవిస్తున్న అన్నాడీఎంకే నేత శశికళ ఆస్తులపై ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. తమిళనాడు, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్ లలోని 187 ఆస్తులపై ఒకేసారి ఐటీ శాఖాధికారులు దాడులు నిర్వహించారు. ఇందులోని 40 చోట్ల దాడులు పూర్తికాగా, మిగిలిన చోట్ల దాడులు కొనసాగుతున్నాయి.

పన్ను ఎగవేసినట్లు ఆరోపణలతో పాటు.. డొల్ల కంపెనీల్లో పెట్టుబడులు పెట్టినట్లు సమాచారం రావడంతో అధికారులు ఈ తనిఖీలు చేపట్టినట్టు తెలుస్తోంది. కాగా, ఈ దాడులపై నిన్న దినకరన్ మాట్లాడుతూ, తన రాజకీయ జీవితంలో ఇలాంటి దాడులు చాలా చూశానని అన్నారు. రాజకీయాల నుంచి వెళ్లగొట్టేందుకు కేంద్రప్రభుత్వం ఇలాంటి దాడులు చేస్తోందని ఆయన ఆరోపించారు. తాను లేకున్నా తన అనుచరులు పార్టీని నడిపిస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. 

More Telugu News