Reliance: జియో నుంచి మరో సంచలన ఆఫర్.. ప్రైమ్ సభ్యులకు మాత్రమే!

  • తక్షణ క్యాష్ బ్యాక్ ఆఫర్ ప్రకటన
  • రూ.399తో రీచార్జ్ చేసుకున్న ప్రతిసారీ ఫ్రీ ఓచర్లు 
  • అమెజాన్ పే, యాక్సిస్ పే, ఫ్రీచార్జ్, మొబిక్విక్‌లో రీచార్జ్ చేసుకుంటే రూ.300 క్యాష్ బ్యాక్

సంచలనాలను తన చిరునామాగా మార్చుకున్న రిలయన్స్ జియో మరో సంచలన ఆఫర్‌ను ప్రకటించింది. ‘ట్రిపుల్ క్యాష్ బ్యాక్ ఆఫర్’ పేరుతో రూ. 399 అంతకంటే ఎక్కువ రీచార్జ్ చేసుకునే జియో ప్రైమ్ సభ్యులకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. రూ. 399తో రీచార్జ్ చేసుకున్న ప్రతిసారీ రూ.50 విలువైన 8 వోచర్లు ఖాతాదారుడి ‘మై జియో’ వాలెట్‌లో క్రెడిట్ అవుతాయి. తర్వాత రీచార్జ్ చేసుకునే సమయంలో ప్రతీసారి ఓ కూపన్‌ను వినియోగించుకోవచ్చు.

అలాగే జియో భాగస్వామ్య మొబైల్ వాలెట్లు అయిన అమెజాన్ పే, యాక్సిస్ పే, ఫ్రీచార్జ్, మొబిక్విక్, పేటీఎం, ఫోన్‌పే వాలెట్లలో రూ. 300 విలువైన వోచర్లు క్రెడిట్ అవుతాయి. అంతేకాక జియో ప్రైమ్ మెంబర్లు ఈ-కామర్స్ సైట్లలో షాపింగ్ చేస్తే రూ. 1,899 విలువైన ఓచర్లు లభిస్తాయి. ఫ్లైట్ టికెట్ల బుకింగ్‌పై డిస్కౌంట్ కూడా లభిస్తుంది. నేటి నుంచి ఈనెల 25 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. 15వ తేదీ నుంచి క్యాష్ బ్యాక్ ఓచర్లు కస్టమర్ల ఖాతాలో జమ అవుతాయి.  

అమెజాన్ పేలో రీచార్జ్ చేసుకునే వినియోగదారులకు రూ. 99 తక్షణ క్యాష్ బ్యాక్ లభిస్తుంది. ఇప్పటికే రీచార్జ్ చేసుకున్న వారికి రూ. 20 క్యాష్ బ్యాక్ లభిస్తుంది. పేటీఎం రూ. 50 తక్షణ క్యాష్ బ్యాక్ ప్రకటించింది. అలాగే ఫోన్ పే రూ. 75, మొబిక్విక్ రూ. 300, యాక్సిస్ పే రూ.100, ఫ్రీచార్జ్ రూ. 50 క్యాష్ బ్యాక్ ఇవ్వనున్నాయి. ఇప్పటికే ఈ యాప్‌లను ఉపయోగించి రీచార్జ్ చేసుకున్న వినియోగదారులకు అమెజాన్ రూ. 20, పేటీఎం రూ.15, ఫోన్ పే రూ. 30, మొబిక్విక్ రూ. 149, యాక్సిస్ పే రూ.35 వరకు వెనక్కి ఇవ్వనున్నాయి.  

ఈ-కామర్స్ సంస్థలు ఇచ్చే క్యాష్ బ్యాక్ ఓచర్లతో అజియో, యాత్రా డాట్ కామ్, రిలయన్స్ ట్రెండ్స్‌లలో షాపింగ్ చేయవచ్చని జియో తెలిపింది. మరిన్ని వివరాల కోసం జియో వెబ్ సైట్‌ను సందర్శించవచ్చు.

More Telugu News