kurnool: మ‌తి స్థిమితం లేని యువ‌కుడి వీరంగం.. ఇద్దరి గొంతుకోసిన వైనం

  • దారుణానికి పాల్పడి ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేసిన యువ‌కుడు
  • ఆసుప‌త్రిలో ముగ్గురికీ చికిత్స‌
  • క‌ర్నూలు జిల్లా బుధ‌వార‌పేట‌లో ఘ‌ట‌న‌

క‌ర్నూలు జిల్లా బుధ‌వార‌పేట‌లో మ‌తిస్థిమితంలేని ఓ యువ‌కుడు దారుణానికి పాల్ప‌డ్డాడు. రోడ్ల‌పై క‌త్తితో తిరుగుతూ బెంబేలెత్తించాడు. క‌త్తితో ఇద్ద‌రు వ్య‌క్తుల గొంతు కోసి క‌ల‌క‌లం రేపాడు. అనంత‌రం త‌న గొంతు కూడా కోసుకుని ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేశాడు. ఈ ఘ‌ట‌న‌పై వెంట‌నే స్పందించిన స్థానికులు ముగ్గురినీ క‌ర్నూలు ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఈ ఘ‌ట‌న‌పై స‌మాచారం అందుకున్న పోలీసులు మ‌తిస్థిమితం లేని యువ‌కుడి పేరు యుగంధ‌ర్‌గా గుర్తించారు. బాధితులు బాబూరావు, ర‌వి కొండ‌ల‌రావు అని చెప్పారు. ముగ్గురికీ చికిత్స అందుతోంద‌ని తెలిపారు.   

More Telugu News