ntr: 'జై లవ కుశ' దుమ్మురేపేసింది .. 50 రోజులు పూర్తి చేసేసింది!

  • సెప్టెంబర్ 21న విడుదలైన 'జై లవ కుశ' 
  • అప్పటి నుంచి కొన్ని థియేటర్స్ లో సందడి చేస్తూనే వుంది 
  • ఎన్టీఆర్ మూడు పాత్రలే ప్రధానమైన బలం
  • ఆయన కెరియర్లో అత్యధిక వసూళ్లను రాబట్టిన రెండవ చిత్రం

కల్యాణ్ రామ్ నిర్మాణంలో .. బాబీ దర్శకత్వంలో ఎన్టీఆర్ కథానాయకుడిగా నటించిన 'జై లవ కుశ', విడుదలైన ప్రతి చోటా విజయవిహారం చేస్తోంది. తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా ఓవర్సీస్ లోను ఈ సినిమా తన సత్తా చాటుకుంది. 72 కోట్ల షేర్ ను రాబట్టి .. ఎన్టీఆర్ కెరియర్లోనే అత్యధిక వసూళ్లను రాబట్టిన రెండవ చిత్రంగా నిలిచింది.

 సెప్టెంబర్ 21వ తేదీన విడుదలైన ఈ సినిమా, తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఈ రోజుతో 50 రోజులు పూర్తి చేసుకుంది. దాంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ థియేటర్స్ దగ్గర సంబరాలు జరుపుకుంటున్నారు. ఎన్టీఆర్ మూడు విభిన్నమైన పాత్రలను పోషించడం ఈ సినిమాకి ప్రధానమైన బలంగా నిలిచింది. ముఖ్యంగా నెగెటివ్ షేడ్స్ తో కూడిన 'జై' పాత్ర ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయింది. అందరూ కూడా ఈ పాత్రలో కొత్త ఎన్టీఆర్ ను చూశారు. యూత్ ను .. మాస్ ను .. ఫ్యామిలీ ఆడియన్స్ ను థియేటర్స్ కి రప్పించడంలో సక్సెస్ కావడం వల్లనే, ఈ సినిమా 50 పరుగులను పూర్తి చేసుకుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.   

More Telugu News