Hyderabad: అక్ర‌మ నిర్మాణాన్ని అడ్డుకున్నందుకు జీహెచ్ఎంసీ అధికారిణిపై దాడి చేసిన కార్పొరేట‌ర్ భ‌ర్త!

  • హైద‌రాబాద్‌లోని కాచిగూడ‌లో ఘ‌ట‌న‌
  • కార్పొరేట‌ర్ చైత‌న్య భ‌ర్త క‌న్న యాద‌వ్ దురుసు ప్ర‌వ‌ర్త‌న‌
  • భ‌వ‌న నిర్మాణానికి అనుమ‌తులు లేవ‌ని అధికారిణి చెప్పినందుకు దాడి
  • పోలీసు కేసు న‌మోదు

హైద‌రాబాద్‌లోని కాచిగూడ‌లో దారుణ ఘ‌ట‌న చోటు చేసుకుంది. కార్పొరేట‌ర్ చైత‌న్య భ‌ర్త క‌న్న యాద‌వ్ ఆ ప్రాంతంలో అక్ర‌మంగా భ‌వ‌న నిర్మాణ ప‌నులు చేప‌డుతున్నాడు. ఈ విష‌యాన్ని గుర్తించిన జీహెచ్ఎంసీ అధికారిణి వాణి అక్క‌డ‌కు వెళ్లి భ‌వ‌న నిర్మాణ ప‌నులను అడ్డుకున్నారు. ఆ భ‌వ‌న నిర్మాణానికి అనుమ‌తులు లేవ‌ని చెప్పారు. దీంతో ఆగ్ర‌హం తెచ్చుకున్న క‌న్న యాద‌వ్ ఆమెపై దాడికి దిగాడు. త‌న మీద జ‌రిగిన దాడిపై  జీహెచ్ఎంసీ అధికారిణి కాచిగూడ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించారు. 

More Telugu News