kodela sivaprasad: ఎమ్మెల్యే వంతల రాజేశ్వరిని అనర్హురాలిగా ప్రకటించాలి!: స్పీకర్ కు వైసీపీ ఎమ్మెల్యేల విజ్ఞప్తి

  • పార్టీ మారిన రాజేశ్వరిపై చర్యలు తీసుకోవాలంటూ విన్నపం
  • గతంలో పార్టీ మారిన వారిపై కూడా వెంటనే చర్యలు తీసుకోవాలి
  • విపక్ష ఎమ్మెల్యేలతో నడుస్తున్న ప్రభుత్వం ఇదేనన్న ధర్మాన

ఏపీ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావును ఈ రోజు వైసీపీ ఎమ్మెల్యేలు కలిశారు. తమ పార్టీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరిపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా స్పీకర్ ను కోరారు. ఆమెను అనర్హురాలిగా ప్రకటించాలని విన్నవించారు. గతంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఇచ్చిన ఫిర్యాదులపై కూడా వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.

వంతల రాజేశ్వరి ఈ నెల 4వ తేదీన టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమెకు టీడీపీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. మరోవైపు, తన నియోజకవర్గ అభివృద్ధి కోసమే టీడీపీలో చేరానని రాజేశ్వరి తెలిపారు. ఈ సందర్బంగా వైసీపీ ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ, తమ పార్టీకి చెందిన 22 మంది ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకుని ప్రభుత్వం నడిపిస్తున్నారని విమర్శించారు. దేశంలో విపక్ష ఎమ్మెల్యేలతో నడుస్తున్న ఏకైక ప్రభుత్వం ఇదేనని ఎద్దేవా చేశారు.

More Telugu News