maharashtra: 'గత జన్మలో నువ్వు నా భార్యవి' అంటూ అత్యాచారం చేసిన సాధువు!

  • దైవ స్వరూపాన్నంటూ ప్రకటించిన సాయిలాల్ జెధియా
  • కేన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధులను నయం చేస్తానంటూ డబ్బు సంపాదన
  • భక్తురాలిని మభ్యపెట్టి టూర్లకు తీసుకెళ్లిన వైనం 
  • అసోంలో అత్యాచారం

మహారాష్ట్రలో అత్యాచారం ఘటనలో ఓ సాధువును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాని వివరాల్లోకి వెళ్తే... మహారాష్ట్రలోని థానేకి చెందిన సాయిలాల్‌ జెధియా అనే వ్యక్తి తాను దైవస్వరూపాన్నంటూ ప్రకటించుకుని, భక్తి ముసుగులో ప్రజలను మోసం చేస్తుండేవాడు. ఏకంగా క్యాన్సర్‌ వంటి ప్రాణాంతక రోగాలను కూడా నయం చేసేస్తానని మభ్యపెట్టి భారీ ఎత్తున డబ్బు దోచుకున్నాడు. ఈ క్రమంలో ఒక మహిళ అతని వద్దకు సాయం కోసం వెళ్లింది. ఆమెను అతను 'గత జన్మలో నువ్వు నా భార్యవు' అంటూ వివిధ ప్రదేశాలకు తీసుకెళ్లేవాడు.

 అతనిపైనున్న గుడ్డి నమ్మకంతో ఆమె కూడా అతని వెంట వెళ్లేది. ఈ క్రమంలో గత నెల ఆమెను అసోం తీసుకెళ్లిన సాయిలాల్.. అక్కడ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆమె అక్కడి నుంచి వచ్చి పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు, పరారీలో ఉన్న అతని కోసం గాలింపు చేపట్టారు. నెల రోజుల శోధన అనంతరం అతనిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ సందర్భంగా ఫిర్యాదు చేసిన మహిళ గత జన్మలో తన భార్య అని, అందుకే ఆమెతో అలా ప్రవర్తించానని చెప్పడంతో వారు విస్తుపోయారు. దీంతో అతనిపై కేసు నమోదు చేసి, రిమాండ్ కు తరలించారు. 

More Telugu News