Virat Kohli: చివ‌రి టీ20కి వ‌ర్షం అడ్డు: మైదానంలో హాయిగా ఫుట్‌బాల్ ఆడుకుంటోన్న కోహ్లీ సేన

  • తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ స్టేడియంలో మూడో వ‌న్డే
  • వ‌ర్షం కార‌ణంగా మ్యాచ్ ఆల‌స్యం
  • మైదానంలో కోహ్లీ సేన మ‌రో ఆట‌

తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ స్టేడియంలో మ‌రికాసేప‌ట్లో భార‌త్-న్యూజిలాండ్ క్రికెట్ టీమ్‌ల మ‌ధ్య‌ చివ‌రి టీ 20 మ్యాచ్ ప్రారంభ‌మ‌య్యే అవ‌కాశం ఉంది. వ‌ర్షం కార‌ణంగా మ్యాచ్ ఆల‌స్యంగా ప్రారంభం కానున్న నేప‌థ్యంలో మైదానంలో కోహ్లీసేన ఫుట్‌బాల్‌తో ఆడుకుంటోంది. ఈ స‌ర‌దా స‌న్నివేశాన్ని బీసీసీఐ త‌మ ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేసింది. కాగా, వ‌ర్షం త‌గ్గ‌డంతో పిచ్‌పై కప్పిన కవర్లను తొల‌గిస్తున్నారు. రాత్రి 8 గంట‌ల‌కు టాస్ వేసే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. పిచ్‌ను ప‌రిశీలిస్తూ మ్యాచ్‌ను ప్రారంభించే అంశంపై అంపైర్లు చ‌ర్చిస్తున్నారు.    

 


More Telugu News