Cricket: భారత్‌-న్యూజిలాండ్‌ టీ20.. ఆల‌స్యంగా ప్రారంభ‌మ‌య్యే అవ‌కాశం!

  • తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ స్టేడియంలో మూడో వ‌న్డే
  • ఉద‌యం నుంచి వ‌ర్షం పడుతూనే వుంది 
  • కాస్త త‌గ్గ‌డంతో మ్యాచ్ నిర్వ‌హ‌ణ‌పై చిగురించిన ఆశ‌లు

తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ స్టేడియంలో ఈ రోజు భార‌త్-న్యూజిలాండ్ క్రికెట్ టీమ్‌ల మ‌ధ్య‌ చివ‌రి టీ 20 మ్యాచ్ జ‌ర‌గ‌నున్న విష‌యం తెలిసిందే. అయితే, మ్యాచ్ కాస్త ఆల‌స్యంగా ప్రారంభం కానుంది. ఈ రోజు ఉదయం నుంచి మైదానంలో వ‌ర్షం ప‌డుతోంది. కొద్దిసేప‌టి క్రితం వ‌ర్షం త‌గ్గ‌డంతో పిచ్‌పై కప్పిన కవర్లను తొల‌గించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

మ్యాచ్‌ కోసం గ్రౌండ్‌ను సిద్ధం చేస్తున్నారు. పిచ్‌ను ప‌రిశీలించిన త‌రువాత మ్యాచ్‌కు గ్రౌండ్ అనుకూలంగా ఉంద‌ని అనిపిస్తే టాస్ వేసే అవ‌కాశం ఉంది. ఈ రోజు జ‌రిగే మ్యాచ్‌లో ఏ టీమ్ గెలిస్తే ఆ జ‌ట్టుకే సిరీస్ సొంత‌మ‌వుతుంది. ఇరు జ‌ట్లు 1-1 తేడాతో స‌మ ఉజ్జీలుగా ఉన్న విష‌యం తెలిసిందే.   

More Telugu News