nag: 'రాజుగారి గది 2' మొత్తంగా సాధించిన షేర్ ఇదే!

  • ఓంకార్ దర్శకత్వంలో వచ్చిన 'రాజుగారి గది 2'
  • ప్రధాన పాత్రధారులుగా నాగ్, సమంత
  • తెలుగు రాష్ట్రాల్లో 15.39 కోట్ల షేర్ 
  • వరల్డ్ వైడ్ షేర్ 18.14 కోట్లు          

ఓంకార్ దర్శకత్వంలో రూపొందిన 'రాజుగారి గది 2' అక్టోబర్ 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నాగార్జున .. సమంత .. శీరత్ కపూర్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, భారీ అంచనాల మధ్య విడుదలైంది. భారీ ఓపెనింగ్స్ కూడా ఉండటంతో, ఈ సినిమా వసూళ్ల పరంగా కొత్త రికార్డులను సృష్టించడం ఖాయమని అనుకున్నారు. కానీ ఆశించిన స్థాయిలో వసూళ్ల జోరు కొనసాగలేదు.

దాంతో వసూళ్ల పరంగా అనుకున్న మార్క్ ను చేరకుండానే బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా రన్ ముగిసింది. ఒక్క నైజామ్ లోనే ఈ సినిమా 6.25 కోట్ల షేర్ ను సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో 15.39 కోట్ల షేర్ ను వసూలు చేసిన ఈ సినిమా, ప్రపంచవ్యాప్తంగా 18.14 కోట్ల షేర్ ను రాబట్టింది. పీవీపీ లాంటి పెద్ద బ్యానర్లో ఈ సినిమా రావడం .. నాగ్ - సమంత ప్రధాన పాత్రలు పోషించడం వలన, వసూళ్ల పరంగా దుమ్మురేపేస్తుందని భావించారు. కానీ ఆ స్థాయిలో ఈ సినిమా పరుగులు తీయలేకపోయింది.    

More Telugu News