Panasonic: బ్రహ్మాండమైన బ్యాటరీ సామర్థ్యం.. సరసమైన ధర.. భారత మార్కెట్లోకి పానసోనిక్ ‘ఎలుగా ఏ4’

  • ఆర్టిఫియల్ ఇంటెలిజెన్స్.. అదిరిపోయే ఫీచర్లు
  • సమాచార భద్రత కోసం ఎన్‌క్రిప్షన్ చిప్
  • షియోమీ రెడ్‌మీ నోట్ 4కు గట్టి పోటీ

సరమైన ధర, బ్రహ్మాండమైన బ్యాటరీ సామర్థ్యం కలిగిన స్మార్ట్‌ఫోన్‌ను పానసోనిక్ ఇండియా సోమవారం మార్కెట్లోకి విడుదల చేసింది. ‘ఎలుగా ఏ4’ పేరుతో విడుదల చేసిన ఈ ఫోన్‌లో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీని ఉపయోగించారు. ధర రూ.12,490. మూడు రంగుల్లో అందుబాటులో ఉన్న ‘ఎలుగా ఏ4’ను పానసోనిక్ అథరైజ్‌డీలర్ల వద్ద అందుబాటులో ఉంది.

ఈ ఫోన్‌లో ఉపయోగించిన పవర్‌ఫుల్ బ్యాటరీ కారణంగా షియోమీ ‘రెడ్‌మీ నోట్ 4’కు ఇది గట్టి పోటీ ఇస్తుందని భావిస్తున్నారు. ఇక ఫీచర్ల విషయానికొస్తే.. 5.2 అంగుళాల హెచ్‌డీ ఐపీఎస్ 2.5డీ కర్వ్‌డ్ డిస్‌ప్లే, 3 జీబీ ర్యామ్, 32 జీబీ అంతర్గత మెమొరీ, ఎస్‌డీ కార్డు ద్వారా 128 జీబీ వరకు విస్తరించుకునే అవకాశం ఉన్నాయి.

13 మెగా పిక్సల్ రియర్, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా ఉన్న ‘ఎలుగా ఏ4’ ఓటీజీకి సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఓఎస్‌తో ఇది పనిచేస్తుంది. అలాగే ‘ఆర్బో’ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ని ఉపయోగించడం విశేషం. ఇందులో ఉపయోగించిన అడ్వాన్స్‌డ్ ఎన్‌క్రిప్షన్ చిప్ వల్ల ఫోన్‌లోని సమస్త సమాచారం భద్రంగా ఉంటుందని పానసోనిక్ ఇండియా మొబిలిటీ డివిజన్ బిజినెస్ హెడ్ పంకజ్ రాణా తెలిపారు.

More Telugu News