Gujarath: గుజరాత్ బీజేపీ మహిళా నేత అశ్లీల చిత్రాలు వైరల్.. విచారణకు ఆదేశించిన హైకోర్టు!

  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న బీజేపీ మహిళా నేత అశ్లీల చిత్రాలు
  • హైకోర్టును ఆశ్రయించిన రేష్మా పటేల్
  • నిజానిజాలు వెలికి తీయాలని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు 

పటీదార్ ఆరక్షణ్ మాజీ ఉద్యమకారిణి, గుజరాత్ బీజేపీ మహిళా నేత రేష్మా పటేల్ అశ్లీల చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ చేశారన్న ఆరోపణలతో ఓ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పటీదార్ ఉద్యమకారులు ప్రస్తుతం కాంగ్రెస్ కు మద్దతు పలుకుతున్నారు. గతంలో పటీదార్ ఉద్యమంలో పనిచేసిన రేష్మా మాత్రం ఇటీవల బీజేపీలో చేరారు.

ఈ నేపథ్యంలో సనీ పటేల్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో తనకు చెందినవని చెబుతూ కొన్ని అశ్లీల చిత్రాలు సోషల్ మీడియాలో పోస్టు చేసి, తన ప్రతిష్ఠకు భంగం కలిగేలా ప్రవర్తిస్తున్నాడని గుజరాత్ హైకోర్టును ఆమె ఆశ్రయించారు. దీనిపై నిజానిజాలు వెలికి తీయాలని సైబర్ క్రైమ్ పోలీసు అధికారులను గుజరాత్ హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో సైబర్ క్రైమ్ పోలీసులు సనీ పటేల్ ను అదుపులోకి తీసుకుని, విచారణ ప్రారంభించారు. 

More Telugu News