airtel: రూ.349 ప్లాన్‌కు రోజుకి 500 ఎంబీ డేటాను అధికంగా ఇస్తోన్న ఎయిర్‌టెల్‌!

  • ఇప్ప‌టివ‌ర‌కు రూ.349 రీచార్జ్‌తో రోజుకు 1జీబీ ఉచిత 4జీ డేటా అందించిన ఎయిర్‌టెల్‌
  • 28 రోజుల పాటు రోజుకు 250 నిమిషాల‌ కాల్స్ ఫ్రీ
  • మొత్తం 3 వేల ఎస్‌ఎంఎస్‌లు కూడా

టెలికాం రంగ దిగ్గ‌జ కంపెనీ భార‌తీ ఎయిర్‌టెల్ మ‌రో ఆఫ‌ర్‌తో త‌మ ప్రీపెయిడ్ వినియోగ‌దారుల ముందుకు వ‌చ్చింది. ఎయిర్‌టెల్‌ రూ.349 రీచార్జ్‌తో రోజుకు 1జీబీ ఉచిత 4జీ డేటా అందిస్తోన్న విష‌యం తెలిసిందే. ఇక‌పై ఆ ప్లాన్‌తో రోజుకి 1.5 జీబీ డేటాను అందిస్తామ‌ని ప్ర‌క‌ట‌న చేసింది. ఈ ప్లాన్‌ను 28 రోజుల కాల వ్య‌వ‌ధితో అందిస్తోంది. ఈ ప్లాన్‌లో రోజుకు 250 నిమిషాల‌ కాల్స్ ఉచితంగా చేసుకోవ‌చ్చు. అలాగే మొత్తం 3 వేల ఎస్‌ఎంఎస్‌లు పొంద‌వ‌చ్చు. టెలికాం మార్కెట్‌లో జియో ఇస్తోన్న పోటీతో ఇత‌ర టెలికాం సంస్థ‌లు కూడా రేట్లు త‌గ్గిస్తూ వ‌స్తోన్న విష‌యం తెలిసిందే.  

More Telugu News