mrps: తెలంగాణ అసెంబ్లీ నుంచి ఉస్మానియా ఆసుప‌త్రి వ‌ద్ద‌కు బ‌య‌లుదేరిన‌ అఖిలప‌క్ష నేతలు!

  • హైద‌రాబాద్ కలెక్ట‌రేట్ వ‌ద్ద‌ భార‌తి అనే ఎమ్మార్పీఎస్ కార్య‌క‌ర్త మృతి
  • ఉస్మానియా ఆసుప‌త్రిలో ఆమె మృత‌దేహం
  • నివాళులు అర్పించేందుకు వెళుతోన్న నేత‌లు

ఈ రోజు ఎమ్మార్పీఎస్ చేప‌ట్టిన రాష్ట్ర వ్యాప్త క‌లెక్ట‌రేట్ల ముట్ట‌డి కార్య‌క్ర‌మంలో అపశ్రుతి చోటు చేసుకున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో హైద‌రాబాద్ కలెక్ట‌రేట్ వ‌ద్ద‌ భార‌తి అనే ఎమ్మార్పీఎస్ కార్య‌క‌ర్త ధ‌ర్నాలో పాల్గొంటూ అస్వ‌స్థ‌త‌కు గురై మృతి చెందారు. ప్ర‌స్తుతం ఆమె మృత‌దేహం ఉస్మానియా ఆసుప‌త్రిలో ఉంది. అయితే, ఆమె మృతదేహాన్ని శ‌వ ప‌రీక్ష కోసం తీసుకెళుతుండ‌గా ఎమ్మార్పీఎస్ కార్య‌క‌ర్త‌లు అడ్డుకున్నారు. దీంతో అక్క‌డ గంద‌ర‌గోళం ఏర్ప‌డింది.

మ‌రోవైపు తెలంగాణ‌ అసెంబ్లీ వాయిదా ప‌డింది. అనంత‌రం అఖిలప‌క్ష నేత‌లు భార‌తి మృత‌దేహానికి నివాళులు అర్పించేందుకు ఉస్మానియా ఆసుప‌త్రికి బ‌య‌లుదేరారు. కాగా, భార‌తి కుటుంబానికి ఇప్పటికే రూ25 ల‌క్ష‌ల ఆర్థిక సాయం ప్రకటించిన ముఖ్యమంత్రి.. ఆమె ఇంట్లో అర్హులు ఉంటే ఉద్యోగం కూడా ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు.  

More Telugu News