rajanikanth: ఇలా చేస్తే ఎలా అంటూ '2.0' టీమ్ పై ఇతర నిర్మాతల అసహనం!

  • శంకర్ తాజా చిత్రంగా '2.0'
  • ప్రధాన పాత్రధారులుగా రజనీ, అక్షయ్ 
  • విడుదల తేదీపై అయోమయం 
  • క్లారిటీ ఇవ్వని దర్శక నిర్మాతలు  

రజనీకాంత్ .. శంకర్ కాంబినేషన్ కి గల క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. ఈ సారి ఈ కాంబినేషన్ కి అక్షయ్ కుమార్ ఇమేజ్ .. అమీ జాక్సన్ గ్లామర్ కూడా తోడైంది. ఫలితంగా '2.0'పై ఒక రేంజ్ లో అంచనాలు వున్నాయి. ముందుగా ఈ సినిమాను దీపావళికి విడుదల చేయనున్నట్టు చెప్పారు. ఆ తరువాత ఆ నిర్ణయాన్ని మార్చుకుని, జనవరి 25న విడుదల చేయనున్నామని ప్రకటించారు.

 అభిమానులంతా ఆ రోజు కోసం ఆత్రుతగా ఎదురుచూస్తుండగా, ఆ రోజున కూడా ఈ సినిమా థియేటర్లకు వచ్చే అవకాశం లేదనే టాక్ వినిపిస్తోంది. తమిళ సంవత్సరాది సందర్భంగా ఏప్రిల్ 13వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో దర్శక నిర్మాతలు వున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన రాలేదు. ఈ నేపథ్యంలో ఈ సినిమా రిలీజ్ ను బట్టి తమ సినిమాల విడుదలను ప్లాన్ చేసుకోవాలనుకున్న నిర్మాతలు, తీవ్రమైన అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారట. తమని అయోమయానికి గురిచేయకుండా అసలు తేదీని ఎనౌన్స్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారనేది కోలీవుడ్ టాక్.             

More Telugu News