venkatesh: తేజ సెంటిమెంట్ .. తొలిసారి వెంకీ జోడీగా కాజల్!

  • వెంకటేశ్ హీరోగా తేజ సినిమా 
  • కథానాయికగా కాజల్ 
  • డిసెంబర్ 13న షూటింగ్ ప్రారంభం  

వెంకటేశ్ కథానాయకుడిగా తేజ ఒక సినిమాను తెరకెక్కించడానికి రంగాన్ని సిద్ధం చేస్తున్నాడు. సురేశ్ ప్రొడక్షన్స్ వారు .. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ వారు కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఒక విభిన్నమైన కాన్సెప్ట్ తో ఈ సినిమా రూపొందనుంది. ఈ సినిమాకి కథానాయికగా అనుష్కను తీసుకునే అవకాశాలు వున్నాయంటూ ప్రచారం జరిగింది. కానీ వెంకటేశ్ సరసన నాయికగా కాజల్ ను తీసుకున్నారనేది తాజా సమాచారం.

చాలాకాలం క్రితం తేజ దర్శకత్వంలో వచ్చిన 'లక్ష్మీ కల్యాణం' సినిమాతోనే తెలుగు తెరకు కాజల్ పరిచయమైంది. ఈ మధ్య తేజకు సక్సెస్ లు లేకపోయినా .. తనకి ఫస్టు ఛాన్స్ ఇచ్చాడనే కృతజ్ఞతతోనే కాజల్ 'నేనే రాజు నేనే మంత్రి' లో చేయడానికి అంగీకరించింది. ఆ సినిమా హిట్ కావడం తేజతో పాటు ఆమెకి కూడా కలిసొచ్చింది. ఆ సెంటిమెంట్ కారణంగానే వెంకటేశ్ జోడీగా కాజల్ నే తేజ తీసుకున్నాడని చెప్పుకుంటున్నారు. వెంకటేశ్ తో కాజల్ నటించడం ఇదే మొదటిసారి. వెంకటేశ్ పుట్టినరోజైన డిసెంబర్ 13న ఈ సినిమాను లాంచ్ చేయనున్నారు.                

More Telugu News